పండగంటే అందరికీ సంబరమే..అందులోనూ పుస్తకాలపండగంటే సాహితీప్రియులకు విందుభోజనమే. అటువంటి పుస్తకాలపండగ 2014 బుక్ ఫెయిర్..ఈ సంవత్సరం డిశంబరు 17 నుంచి 26 వరకు ఇందిరాపార్కు ఎదురుగావున్న ఏన్.టి.ఆర్. స్టేడియంలో ఘనంగా నిర్వహించబడింది. ఆ.. ఇదంతా ప్రతియేడూ జరిగేదే కదా.. ఏవుంది..మహా గొప్ప.. అంటారా.. ఉందండీ.. ఉత్తి గొప్పే కాదు. చాలా గొప్పవిషయమే ఉంది.
ఒక అగ్గిపుల్ల ఉందనుకోండి. దాని వల్ల వచ్చే వేడిని దేవునిదగ్గర దీపం
వెలిగించుకుందుకూ వాడొచ్చు, అందరికీ కడుపునిండేలా వంట చేయడానికీ వాడొచ్చు, ఇంకా తీవ్రంగా
ఆలోచించేవాళ్ళు ఇల్లు తగలబెట్టడానికీ వాడొచ్చు. మేము అంటే మా ప్రమదలందరం ఆ వేడితో
అక్షరజ్యోతిని వెలిగించుకున్నాం. అదే “ప్రమదాక్షరి..”
అక్షరం అంటే ఆసక్తిగల కొంతమందిమి ఫేస్ బుక్ ద్వారా
ఒకరినొకరం పరిచయం చేసుకుని, మాధ్యమంద్వారానూ, వీలున్నవాళ్ళు వ్యక్తిగతంగానూ ఒకటికిరెండుసార్లు
కలుసుకొని, ఒకగ్రూప్ గా యేర్పడదామని ఆలోచించుకుని, ఏర్పరచుకున్నదే ఈ “ప్రమదాక్షరి..”. ఇందులో సాహితీప్రియులయిన రచయిత్రులూ, విమర్శకులూ, పాఠకురాళ్ళూ
అందరూ సభ్యులే. ఈ ప్రమదాక్షరికి అడ్మిన్ లుగా మంథా భానుమతి, సమ్మెట ఉమాదేవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వాటినన్నింటినీ
మాలిక పత్రికలో ప్రచురించడమే కాకుండా, ఈ యేడే పబ్లిషింగ్ మొదలుపెట్టిన జ్యోతి వలబోజు
అందరి సమిష్టికృషితో వాటినన్నింటినీ ఒక పుస్తకంగా తీసుకువచ్చింది.
ప్రతి ఒక్కరికీ వారి కథ ఒక కథాసంకలనంలో చోటు చేసుకుందంటే ఎంత సంతోషమో.
ఉపోద్ఘాతమయిపోయింది
కనుక ఇంక బుక్ ఫేర్ లోకి వెళ్ళిపోదాం.
స్టాల్ ప్రారంభోత్సవ మహోత్సవం..
కాష్ కౌంటర్ లో కన్నెగంటి అనసూయ..
చేదోడు వాదోడుగా..మణి వడ్లమాని, నండూరి సుందరీ నాగమణి..
మీడియావారికి వారణాసి నాగలక్ష్మి చిత్రించిన "ప్రమదాక్షరి లోగో చూపిస్తున్న మంథా భానుమతి.
ఆరోజు అక్కడ వున్న "తండ్రి-తనయ" పుస్తక రచయిత్రులు..
సోమరాజు సుశీలగారిచే "తెలంగాణ వంటలు" పుస్తకావిష్కరణ ...
సరోజినిదేవి బులుసు, పోడూరి కృష్ణకుమారి, కె.బి. లక్ష్మి, శాంతసుందరి..
సుద్దాల అశోక్ తేజ, బొమ్మదేవర నాగకుమారి..
అటువంటి మా ఈ సంతోషాన్ని
పుస్తకప్రియులతో పంచుకుందామనుకున్నాము.
అంతేకాకుండా రచయిత్రులే స్వయంగా ఎవరి పుస్తకాలు వారు
ప్రదర్శించుకుని, పాఠకులతో నేరుగా సంబంధం పెట్టుకోవాలనే
ఆలోచనతో జె.వి. పబ్లిషర్స్, రచయిత్రులూ కలిసి ఈ యేడు బుక్ ఫెయిర్ లో కలిసి తీసుకున్న స్టాల్ ప్రమదాక్షరి & జె.వి. పబ్లిషర్స్ స్టాల్.
ఇదిగో.. ఇదే..
స్టాల్ ప్రారంభోత్సవ మహోత్సవం..
కాష్ కౌంటర్ లో కన్నెగంటి అనసూయ..
చేదోడు వాదోడుగా..మణి వడ్లమాని, నండూరి సుందరీ నాగమణి..
మీడియావారికి వారణాసి నాగలక్ష్మి చిత్రించిన "ప్రమదాక్షరి లోగో చూపిస్తున్న మంథా భానుమతి.
ఆరోజు అక్కడ వున్న "తండ్రి-తనయ" పుస్తక రచయిత్రులు..
సోమరాజు సుశీలగారిచే "తెలంగాణ వంటలు" పుస్తకావిష్కరణ ...
శీలా సుభద్రాదేవిగారిచే "తెలంగాణ వంటలు" పుస్తకావిష్కరణ ...
ముఖ్యంగా చెప్పవలసినదేమిటంటే
ఈ ఉత్సవంలో భాగంగా 23 న కవయిత్రుల కవితాగోష్ఠి జరిగింది. స్వాతీశ్రీపాదవారి
నిర్వహణలో, శిలాలోలితగారి అధ్యక్షతన, సుద్దాల అశోక్ తేజగారు ముఖ్య అతిథిగా, కన్నెగంటి
అనసూయ వ్యాఖ్యానించిన ఈ గోష్ఠిని ప్రమదాక్షరి శీర్షికన నిర్వహించడం విశేషం.
ఈ కవితాగోష్ఠిపై ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త...
ప్రమదాక్షరి స్టాల్ లో రచయిత్రులు..
సరోజినిదేవి బులుసు, పోడూరి కృష్ణకుమారి, కె.బి. లక్ష్మి, శాంతసుందరి..
మధ్యన చాగంటి తులసి
మీడియాతో జ్ఞానప్రసూనగారు...
మా స్టాల్ కు వచ్చి, మాతో కలిసిమెలిసి ముచ్చటించిన ప్రముఖులు...
ఇంద్రగంటి జానకీబాల, శ్రీకాంత శర్మగార్లు..
ఇంద్రగంటి జానకీబాల, శ్రీకాంత శర్మగార్లు..
షరీఫ్ వేంపల్లి, జంపాల చౌదరి, వాసిరెడ్డి నవీన్, అరిపిరాల సత్యప్రసాద్..
సుద్దాల అశోక్ తేజ, బొమ్మదేవర నాగకుమారి..
మన్నెం శారద, దాసరి అమరేంద్ర
పాఠకదేవుళ్ళు, అభిమానులు...
Akkiraju with family
Artist Lakshman
Balabhadrapatruni ramani
Chitra artist
Polkampalli Shanthadevi
P.S.Chary, Meher with family
Kandukuri Ramu
Yakoob Ravi
Vanaja Cee
ఆఖరిరోజు కూడా అలసటే లేదు...
కొసరు ముచ్చట
మహిళలం..మహరాణులం కాగలము... అన్నపూర్ణలమూ కాగలము.. అందుకే అక్కడికి వచ్చిన ప్రతి ప్రమద అక్కడ కూర్చున్న తన తోటి ప్రమదల అలసట పోగొట్టడానికి వారికి తినడానికి యేదో ఒకటి చేసి తెచ్చింది. ఎవరు ఏమి తెచ్చినా, ఎవరికి కాస్త ఖాళీ దొరికితే వారు అన్నీ అందరికీ నోటి దగ్గరికి తెచ్చి పెట్టేసారు. ఇది మన అందరిదీ అనుకుంటూ, అప్పుడే వచ్చిన జ్యోతి పుట్టినరోజుని కూడా బ్రహ్మాండంగా జరిపేసుకున్నారు. అదీ ఐకమత్యమంటే అని ప్రమదాక్షరి మహిళలు చాటి చెప్పారు.
జయహో ప్రమదాక్షరి..
----------------------------------------------------------------------------------------------