
మనము రోజూ దేవునికి పూజ చేసేటప్పుడు ముందుగా జ్యోతిని వెలిగించి ప్రారంభిస్తాము కదా. అలాగే ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు కూడా జ్యోతిని వెలిగించే సాంప్రదాయం మనకి వుంది. అప్పుడు సంస్కృతంలొని శ్లోకాలు కాకుండా అచ్చ తెలుగులో చెప్పుకునే ప్రార్ధన ఒకటి మా ఫ్రెండ్ చెప్పారు. అది ఈ మొట్టమొదటి టపా ద్వారా అందరికీ అందిద్దామని చెపుతున్నాను. నాకు వచ్చినంతమటుకు చెపుతున్నాను. సవరణలుంటే తప్పక సెలవీయండి.
కొండంత చమురు గోరంత వత్తి గోవిందుడా నా దీపాన్ని వెలిగించు.
ఈశ్వరుడా నా దీపాన్ని ప్రకాశించెటట్లు చెయ్యి
పరమేశ్వరుడా నా దీపాన్ని ఫలించేటట్లు చెయ్యి
కాలకంఠుడా నా దీపం కనికరించేటట్లు చెయ్యి
కాశీలొ గయలొ వటవృక్షంకింద యమధర్మరాజు యెదుట పడకుండా చేసి
ఈ నిక్షేపం లాంటి దీపాన్ని మా ఇంట్లో స్థిరంగా నిలిచి వుండేటట్లు చెయ్యి.
పంచభూతాల సాక్షిగా సూర్యచంద్రులు వున్నంతవరకు మా దీపాన్ని మాఇంట్లోఇలాగె నిలిచి వుండేటట్లు చెయ్యి.
కొండంత చమురు గోరంత వత్తి గోవిందుడా నా దీపాన్ని వెలిగించు.
ఈశ్వరుడా నా దీపాన్ని ప్రకాశించెటట్లు చెయ్యి
పరమేశ్వరుడా నా దీపాన్ని ఫలించేటట్లు చెయ్యి
కాలకంఠుడా నా దీపం కనికరించేటట్లు చెయ్యి
కాశీలొ గయలొ వటవృక్షంకింద యమధర్మరాజు యెదుట పడకుండా చేసి
ఈ నిక్షేపం లాంటి దీపాన్ని మా ఇంట్లో స్థిరంగా నిలిచి వుండేటట్లు చెయ్యి.
పంచభూతాల సాక్షిగా సూర్యచంద్రులు వున్నంతవరకు మా దీపాన్ని మాఇంట్లోఇలాగె నిలిచి వుండేటట్లు చెయ్యి.
3 వ్యాఖ్యలు:
raavamma lalithamma blogu lokaaniki,
welcome lalita gaaru,
blog andam gaa baagundi.
inka modati post adaragottesaaru.
photos kevvu keka.
inka blogandi ,i wish you all the best.
Namaskaram srilatha garu...
Mee blog chala bagundhi....
Anil
మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు
* పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు,
* పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
* బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.
* జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
* అనంతపురం జిల్లా హిందూపురం ఎస్.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.
* చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
* చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
* కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.
* బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.
* తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.
* కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.
* నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
దేశంలో కొన్ని మూఢనమ్మకాలు
* ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు
* మధ్య ప్రదేశ్-జబల్పూర్కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm
* కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.
* నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.
* గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట,
Post a Comment