Pages

Friday, October 7, 2011

వందేళ్ళ కథకు వందనాలు



కథాభిమానులందరూ ఇష్టపడే కార్యక్రమం ఈ "వందేళ్ళ కథకు వందనాలు" కార్యక్రమం.
నిన్న మధ్యాహ్నం 1-30 కు హెచ్ఎంటివి లో ప్రసారమయింది.
ఎప్పుడూ సినిమాలతోనూ, వార్తావ్యాఖ్యలతోనూ ప్రసారాలు చూసే వీక్షకులకు ఇది నిజంగా అపూర్వమైన అవకాశం.
ఈ వందేళ్ళలోనూ తెలుగులో వచ్చిన గొప్ప కథలలో వంద కథలను ఎంపిక చేసి ఆ కథలపై సమగ్ర విశ్లేషణ చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.
ఈ ధారావాహికను ప్రముఖ నటులు, రచయిత శ్రీగొల్లపూడి మారుతీరావుగారు నిర్వహిస్తున్నారు.
హెచ్ఎంటివి నిర్వహిస్తున్న ఈ వందేళ్ల కథకు వందనాలు కార్యక్రమం చాలా బాగుంది.
మారుతీరావుగారు సహజంగానే మొదటి ప్రసారంలోనే వీక్షకులని ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమం ప్రతి గురువారం మధ్యాహ్నం 1-30 గంటలకు గంటలకు కు హెచ్ఎంటివి లో ప్రసారమవుతుంది.
ఈ సంగతి తెలియని సాహిత్యాభిమానులందరూ దీనిని చూస్తే బాగుంటుందని ఇలా బ్లాగ్ లో చెపుతున్నాను.

హెచ్ఎంటివి సౌజన్యంతో..

1 వ్యాఖ్యలు:

జయ said...

శ్రీలలిత గారు దీపావళి శుభాకాంక్షలండి.